న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : హైదరాబాద్ మెట్రోపై కేంద్రం మంగళవారం సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి దశ అలైన్మెంట్లో మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
మొదటి గెజిట్ నోటిఫికేషన్లో ఇచ్చిన మ్యాప్ ప్రకారమే మెట్రో పనులు జరుగుతాయని, అలైన్మెంట్లో మార్పులు ఉండవని అధికారులు తేల్చి చెప్పారు. టీ.సీఎస్ రాజీవ్ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా నిన్న ఢిల్లీ వచహోంశాఖ, పీఎంఓ అధికారులతో మెట్రోపై చర్చలు జరిపారు. ఎల్ అండ్ టీ, తెలంగాణ ప్రభుత్వం మద్య వివాదం కారణంగానే కేంద్రం ఈ గెజిట్ నోటీసును విడుదల చేసినట్లుగా తెలియవచ్చింది. ఇక మెట్రో నిర్మాణం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం జోక్యం చేసుకోదలిస్తే కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది.
No comments:
Post a Comment