Tuesday, September 23, 2014

మెట్రో పై మెలిక...తొలి దశ అలైన్మెంట్ లో మార్పులకు కేంద్రం 'నో '

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 : హైదరాబాద్‌ మెట్రోపై కేంద్రం మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొదటి దశ అలైన్‌మెంట్‌లో మార్పులు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. 
 
రూట్‌ కారిడార్‌ 1, కారిడార్‌ 2, కారిడార్‌ 3. ఈ మూడు కారిడార్‌లపై కేంద్రపట్టణాభివృద్ధి శాఖ అధికారులు గెజిట్‌ నోటిపికేషన్‌ ఇచ్చారు. ఇందులో ఏమైనా అలైన్‌మెంట్‌ మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా మార్పులు చేయాలంటే కేంద్రం పార్లమెంట్‌లో చట్టం చేసిన తర్వాతే అలైన్‌మెంట్‌ను మార్చవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. వెలివేటెడ్‌ కారిడార్‌ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటుందని, కేసీఆర్‌ చెప్పినట్లుగా అసెంబ్లీ ముందు, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ మెట్రో లైన్‌ సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.

మొదటి  గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఇచ్చిన మ్యాప్‌ ప్రకారమే మెట్రో పనులు జరుగుతాయని, అలైన్‌మెంట్‌లో మార్పులు ఉండవని అధికారులు తేల్చి చెప్పారు. టీ.సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు పాపారావు కూడా నిన్న ఢిల్లీ వచహోంశాఖ, పీఎంఓ అధికారులతో మెట్రోపై చర్చలు జరిపారు.  ఎల్‌ అండ్‌ టీ, తెలంగాణ ప్రభుత్వం మద్య వివాదం కారణంగానే కేంద్రం ఈ గెజిట్‌ నోటీసును విడుదల చేసినట్లుగా తెలియవచ్చింది. ఇక మెట్రో నిర్మాణం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జోక్యం చేసుకోదలిస్తే కేంద్రం అనుమతి ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...