Tuesday, September 23, 2014

తెలంగాణాలో బడి సెలవుల్లో మార్పు..దసరాకు 15 రోజులు ......సంక్రాంతికి 2 రోజులే...



హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణాలో బతుకమ్మ పండుగకు మరింత ప్రాముఖ్యతను కల్పిస్తూ దసరాకు పాఠశాలలకు 15 రోజులు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణాలో దసరా, బతుకమ్మ పండుగలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

అలాగే సంక్రాంతికి తెలంగాణాలో అంతగా ప్రాధాన్యం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతిని నిర్వహించినంతగా తెలంగాణాలో ఉండదు. అందుకే సంక్రాంతికి సెలవులను రెండు రోజులకే కుదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు.

ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఈ నూతన సెలవుల క్యాలండర్‌ను విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...