న్యూ ఢిల్లీ ,సెప్టెంబర్ 23:
ఢిల్లీ జూ లో విద్యార్ధి ని చంపినా పులి.. ఢిల్లీ జూ లో విద్యార్ధి ని చంపినా పులి..ఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో దారుణం జరిగింది. తెల్ల పులిని ఉంచిన ఎంక్లోజర్ లో పడిపోయి విద్యార్థి మీద పులి దాడి చేసి చంపేసింది. హిమాంశు అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఈ దాడిలో చనిపోయాడు. తెల్లపులిని ఉంచిన ఎంక్లోజర్ చాలా కిందకు వుండటంతో విద్యార్థి లోపలకు పడిపోయాడని, దాంతో అందరూ చూస్తుండగానే పులి ఆ విద్యార్థి మీద దాడిచేసి చంపేసిందని తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన సమయంలో పులి ఎంక్లోజర్ సమీపంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పులి నుంచి విద్యార్థిని కాపాడలేకపోయారు. విద్యార్థి పులి వున్న కంచె మీదకి ఎక్కి లోపలకి తొంగి చూస్తూ వుండగా లోపలకి పడిపోయాడని ఒక కథనం వినిపిస్తూ వుండగా, లోపలకి తొంగి చూస్తున్న విద్యార్థి మీద పులి దాడి చేసి లోపలకి లాగేసిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment