Wednesday, September 24, 2014

నిర్దేశిత కక్ష్యలో మామ్...."

బెంగళూరు, సెప్టెంబర్‌ 24: భారత ఉపగ్రహం మామ్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం ఉదయం విజయవంతంగా నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం సరిగ్గా 7.17 నిమిషాలకు మామ్‌ అంగారక కక్ష్యలో ప్రవేశించింది.

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగం దిగ్విజయం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇదొక కలికితురాయిగా నిలిచిపోనుంది. ఇప్పటివరకూ ఆసియాలో మరే దేశమూ ఇటువంటి ప్రయోగం నిర్వహించలేదు. అందుకే ఈ మంగళయాన్‌ భారత్‌కు మంగళప్రదంగా శాశ్వతంగా నిలిచిపోనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ అంతరిక్ష పరిశోధనలలో యూరోపియన్‌ యూనియన్‌ సరసన ఆత్మగౌరవంతో నిల్చునే అవకాశం దక్కింది. 

భారత ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికి నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా భారత శాస్త్రవేత్తలు యావత్‌ భారత దేశానికే గర్వకారణంగా నిలిచారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి ఈ విజయమే తార్కాణంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...