న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : బొగ్గు క్షేత్రాల కుంభకోణంకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. బుధవారం బొగ్గు కుంభకోణం కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగగా 1993 నుంచి 2011 వరకు కేటాయింపులు జరిగిన 218 బొగ్గు క్షేత్రాల్లో 214 బొగ్గు క్షేత్రాలను రద్దు చేస్తూ ఉన్నతన్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన నాలుగు మెగా పవర్ ప్రాజెక్టులకు మినహా 214 బొగ్గు క్షేత్రాలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన బొగ్గు క్షేత్రాలను తిరిగి వేలం వేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది.
ఆరునెలల్లోగా బొగ్గు క్షేత్రాలను వేలం వేసి ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా చూడాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గత నెల బొగ్గు క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమని ఉన్నతన్యాయస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. యధాలాపంగా జరిగిన బొగ్గు కేటాయింపుల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం 46 బొగ్గు క్షేత్రాలకు మినహాయింపు ఇవ్వాలని కోరగా అందుకు న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. బొగ్గు కేటాయింపుల్లో అవకతవకల వల్ల ఖజానాకు రూ.1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని కోర్టు గుర్తించింది.
ఆరునెలల్లోగా బొగ్గు క్షేత్రాలను వేలం వేసి ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా చూడాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గత నెల బొగ్గు క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమని ఉన్నతన్యాయస్థానం ప్రకటించిన విషయం తెలిసిందే. యధాలాపంగా జరిగిన బొగ్గు కేటాయింపుల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం 46 బొగ్గు క్షేత్రాలకు మినహాయింపు ఇవ్వాలని కోరగా అందుకు న్యాయస్థానం విముఖత వ్యక్తం చేసింది. బొగ్గు కేటాయింపుల్లో అవకతవకల వల్ల ఖజానాకు రూ.1.86 లక్షల కోట్లు నష్టం వాటిల్లిందని కోర్టు గుర్తించింది.
No comments:
Post a Comment