బోస్టన్, సెప్టెంబర్ 1 : దర్శక దిగ్గజం, చిత్రకారుడు బాపు మృతిపై ప్రవాస సంఘాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. బాపు మృతికి తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించాయి. ఆయన మృతి తెలుగు జాతికి తీరని లోటుగా తానా, నాట్స్ అభివర్ణించాయి. తానా తొలిరోజుల నుంచి బాపుగారికి తానాతో ప్రగాఢ అనుబంధం ఉందని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని గుర్తు చేశారు. 1985లో లాస్ ఏంజెలెస్లో జరిగిన తానా మహాసభలలో బాపు ను ముఖ్య అతిథిగా గౌరవించినట్లు ఆయన చెప్పారు. బాపు బొమ్మ, రమణ రచనల మొదటి ప్రచరణల స్వర్ణోత్సవాన్ని 1995లో దశమ తానా మహాసభలలో (చికాగో) ఘనంగా నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఆ సర్వోత్సవాల్లో భాగంగా బాపు-రమణలపై ప్రత్యేకంగా ప్రచురించిన బొమ్మ-బొరుసు అనే పుస్తకం బహుళ ప్రచారం పొందిందని ఆయన అన్నారు. తానా పత్రికకు ప్రత్యేకంగా బాపు రామాయణం, కృష్ణ లీలలు బొమ్మల సీరియల్స్ అందించారని ఆయన గుర్తు చేశారు. కాగా, బాపు మరణవార్త అమెరికాలో ఉండే తెలుగు వారిని కలచి వేసిందని నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాపుకి జీవిత సాఫల్య పురస్కారంతో నాట్స్ సత్కరించుకున్న విషయాన్ని నాట్స్ సభ్యులు గుర్తు చేసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment