వాషింగ్టన్, ఆగస్టు 26: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సెప్టెంబర్ 28న న్యూయార్క్లోని సుప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో నిర్వహించనున్న సభలో 25 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ కన్వీనర్ విజయ్ జోల్లీ, పార్టీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్లకు చెందిన ప్రవాస భారతీయ స్నేహితులు ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రవాసభారతీయులు పెద్ద సంఖలో ఈ సభకు వచ్చేలా చేసేందుకు.. వీరిద్దరూ ఇప్పటికే లాస్ఏంజెలిస్, డల్లాస్, టెక్సాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ సభ గురించి తెలియజేసేందుకు ‘పీఎంవిజిట్ డాట్ ఆర్గ్’ అనే వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. మోదీ పర్యటన గురించి వివరాలను ఈ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే విరాళాలు కూడా అందజేయొచ్చు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా మోదీని ఘనంగా ఆహ్వానించేందుకు ‘ద ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్’ సన్నాహకాలు చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment