హైదరాబాద్, ఆగస్టు 27 : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన శివరామకృష్ణన్ కమిటీ మార్టూరు - వినుకొండ వద్ద ఏపీ రాజధాని ఏర్పాటుకు సుముఖత తెలిపింది. శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను గురువారం కేంద్రహోంశాఖ కార్యదర్శి కి అందజేయనుంది.కమిటీ రెండు భాగాల్లో నివేదిక రూపొందించింది. మొదటి భాగంలో రాజధాని ఎలా ఉండాలనేది ,రెండో భాగంలో మౌలిక వసతులు, సదుపాయాలపై చర్చించింది. మూడు రాజధానుల జోన్లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. సూపర్ సిటీ, స్మార్ట్ సిటీల ఏర్పాటుకు వ్యతిరేకత చూపింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు వల్ల ఆర్థిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ను నాలుగు భాగాలుగా విభజించాలని నివేదికలో కమిటీ పేర్కొంది. వాటిని ఉత్తరాంధ్ర, మధ్యాంథ్ర, కోస్తాంధ్ర, రాయలసీమగా వివరించింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, పెట్టుబడులు ఒకే ప్రాంతంలో ఉండకూడదని కమిటీ స్పష్టం చేసింది. విశాఖను ఐటీ జోన్గా అభివృద్ధి చేయాలని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. ఉత్తరాంధ్ర జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలు ఉండగా, మధ్యాంధ్రలో పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు జిల్లాలు, రాయలసీమకు సంబంధించి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు. కోస్తాంధ్ర జోన్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి. ఇక రాయలసీమలో ట్రాన్స్పోర్టు కారిడార్గా అభివృద్ధి చేయాలని కమిటీ చెప్పింది. కాళహస్తి శ్రేణిలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, బెంగుళూరు-గుంటూరు మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కూడా శివరామకృష్ణన్ కమిటీ వెల్లడించింది. అసెంబ్లీ, సీఎం కార్యాలయం, సెక్రటేరియట్లు రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, విశాఖలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, కర్నూలు లేదా అనంతపురంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, గతంలో రాజధానిగా ఉన్న కర్నూలుకు న్యాయం చేయాలని నివిదికలో శివరామకృష్ణన్ కమిటీ వెల్లడించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment