న్యూఢిల్లీ ,ఆగస్టు 27: వినియోగదారుల ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో బుధవారం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సేవలు స్తంభించిపోయాయి. 100 రూపాయలకే ఎయిర్ ఇండియా టికెట్ అనే కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారానే వినియోగదారులు టికెట్ బుక్ చేసుకోవాలంటూ నిబంధన విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు వెబ్ సైట్ ను సందర్శించారు. దాంతో వెబ్ సైట్ క్రాష్ అయిందని ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఎయిర్ ఇండియా వెబ్ సైట్ సందర్శించిన వారికి 'సేవలు అందుబాటులో లేవు' అనే సందేశం కనిపిస్తోంది. 100 రూపాయల టికెట్ అవకాశాన్నిఆగస్టు 27 తేది నుంచి ఐదు రోజులపాటు కల్పించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment