న్యూఢిల్లీ, ఆగష్టు 25 : బొగ్గు గనుల కుంభ కోణం కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. 1993 నుంచి జరిగిన బొగ్గు గనుల కేటాయింపులన్నీంటినీ రద్దు చేస్తూ సుప్రీం చారిత్ర్మాత్మక నిర్ణయం తీసుకుంది. 1993-2010 మధ్య కాలంలో బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో పారదర్శకత లేదని ఉన్నతన్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే ఆ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా గనులను కేటాయించారే తప్ప చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా కేటాయింపులు జరగలేదని కోర్టు తెలిపింది. వాటిపై మరింత విచారణ జరగాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇకపై బొగ్గు క్షేత్రాల కేటాయింపులను కోర్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఆనాటి కేటాయింపుల సందర్భంగా పోటి బిడింగ్ విధానం అనుసరించలేదని కోర్టు తెలిపింది. అల్ర్టామెగా పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన బొగ్గు గనులు మినహా మిగతా కేటాయింపులు అన్నింటినీ రద్దు చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్పై సెప్టెంబర్ 1 నుంచి జరిగే విచారణ తరువాత కేటాయింపులు ఎలా జరపాలనే విషయం వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. బొగ్గు బ్లాకుల కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోంది. ఆ దర్యాప్తును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. ఈ కేసుపై సీబీఐ త్వరితగతిన విచారణ జరిపి దోషులపై చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment