Monday, August 11, 2014

రైల్వే రిజర్వేషన్లు ప్రైవేటుపరం...

న్యూఢిల్లీ, ఆగస్టు 11 :  రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వై టీ ఎస్‌ కే పేరిట ప్రైవేట్ రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. సర్వీస్ చార్జ్ వసూలు చేసుకునే అవకాశాన్ని వైటీఎస్‌కేలకు అప్పగించింది. అన్‌రిజర్వ్ టిక్కెట్లకు రూపాయి, స్లీపర్ క్లాస్‌ రూ.30, ఏసీ రూ.40  చొప్పున సర్వీస్ చార్జ్‌లు వసూలు చేయనున్నారు.  వైటీఎస్‌కేలు ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి తత్కాల్‌ టిక్కెట్లు ఇవ్వనున్నారు. టిక్కెట్ల దుర్వినియోగం అడ్డుకునేందుకు ప్రత్యేక రంగు టిక్కెట్లు ఇవ్వనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...