న్యూఢిల్లీ, జులై 10: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ (2014-2015) లో ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించ లేదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల ప్రస్తావనేలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన గాని, పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన గాని బడ్జెట్ లో లేనే లేవు. అలాగే కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావనేలేదు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పినవిధంగా ఐఐఎం ను గాని, సెంట్రల్ యూనివర్సిటీని గానీ ప్రకటించలేదు
విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు ఊసే బడ్జెట్ లో లేదు. .ఇక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినవి:
* ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
* ఐఐటి - ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
* వ్యవసాయ విశ్వవిద్యాలయం
* అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
* విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
* కాకినాడ పోర్టు అభివృద్ధి
విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు ఊసే బడ్జెట్ లో లేదు. .ఇక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినవి:
* ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
* ఐఐటి - ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
* వ్యవసాయ విశ్వవిద్యాలయం
* అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు
* విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు
* కాకినాడ పోర్టు అభివృద్ధి
No comments:
Post a Comment