Thursday, July 10, 2014

ఊపు లేని మోడీ సర్కార్ తొలి బడ్జెట్.. ఆదాయపన్ను పరిమితి రు.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంపు

న్యూఢిల్లీ, జులై 10: నరేంద్ర మోడీ సర్కార్ తొలి కేంద్ర బడ్జెట్ సూపర్ డూపర్ గా వుంటుందని ఆశించిన వారికి నిరాశనే మిగులుస్తూ  కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ  17.9 లక్షల కోట్ల రూపాయలతో గురువారం నాడు పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో  ప్రణాళికేతర వ్యయం 12.2 లక్షల కోట్లు కాగా,  ప్రణాళిక వ్యయం రూ.5.75 లక్షల కోట్లు. 
బడ్జెట్  ముఖ్యాంశాలు...
ఆదాయపన్ను పరిమితి రు.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలకు పెంపు. 
పొదుపు పథకాలపై లక్షన్నర వరకు పన్ను మినహాయింపు
 గృహ నిర్మాణాల పైన రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు
ఇన్ కం ట్యాక్స్ సర్ ఛార్జీల్లో మార్పు లేదు. 80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంపు.
బాక్సైట్ ఎగుమతుల పైన ఎక్సైజ్ డ్యూటీ పెంపు
శీతల పానీయాల పైన పన్ను పెంపు.
సిగరెట్ల పైన ఎక్సైజ్ డ్యూటీ 11 శాతం నుండి 72 శాతానికి పెంపు.
సున్నపురాయి, డోలమైట్ పైన పన్ను రాయితీ.
పెట్రో కెమికల్స్ పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు 
ఉక్కు పై దిగుమతి సుంకం 7.5 శాతానికి పెంపు. 
పీపీఎఫ్ స్కీమ్ రూ.లక్ష నుండి లక్షన్నరకు పెంపు.
గంగానదిలో జలమార్గం కోసం నాలుగువేల కోట్ల అంచనా వ్యయం.
 కొత్త బ్యాంకులకు లైసెన్సులు.
2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు
గ్రామజ్యోతి పథకానికి రూ.500 కోట్లు 




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...