న్యూఢిల్లీ, జూన్ 26 : ఆంధ్రప్రదేశ్ను విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కిస్తానని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గోయల్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తమను కలసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. విభజన నేపథ్యంలో విద్యుత్ వాడకం విషయంలో ఆంధ్రపదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అయితే తెలంగాణకు నష్టం జరగకుండా ఏపీకి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని చంద్రబాబు గోయల్ను కోరినట్లుగా సమాచారం. ఏపీ విద్యుత్కు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ కూడా బాబు అందజేశారు. దీనిపై స్పందించిన గోయల్ మాట్లాడుతూ 500 మెగా వాట్ల అదనపు విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి కొత్త ప్రణాళికను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్లోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఈలోగా కొంత సర్దుబాటు జరుగుతుందని ఆయన అన్నారు. 4 వేల మెగావాట్ల విద్యుత్కు సంబంధించి సోలార్ విద్యుత్ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. దీనికి సుమారు 10 వేల ఎకరాల భూమి సేకరించవలసి ఉంటుందని, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ఏపీలో ఏర్పాట్లు చేసుకోవాలని గోయల్ సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment