Thursday, June 26, 2014

బీజేపీ వైపు కిరణ్‌ చూపు ?

హైదరాబాద్, జూన్ 26 : మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మధ్య  గురువారం జరిగిన భేటీ  ఈ ప్రచారానికి బలమిస్తోంది.   కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌తో సమావేశం  వాస్తవమేనని, అయితే  తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని తెలిపారు.కిరణ్‌కుమార్‌రెడ్డి తన వర్గానికి చెందిన 30 మంది నేతలతో బీజేపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధమవుతోందని,  దీనికి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...