హైదరాబాద్, జూన్ 19 : ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 9-22 గంటలకు స్పీకర్గా ఆయన ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక కోసం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలుసుకుని స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపాల్సిందిగా కోరగా అందుకు జగన్ సానుకూలంగా స్పందించి కోడెలకు మద్దతు తెలిపారు. దీంతో కోడెల శివప్రసాద్ పేరును పార్టీ ఖరారు చేసింది. ఎపి శాసన సభలో టిడిపి, అధికార టిడిపి మిత్రపక్షం బిజెపి, ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెసు పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేరు. కోడెల నర్సారావుపేట నుండి గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుండి పోటీ చేసి గెలుపొందారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment