హైదరాబాద్, జూన్ 16: ప్రొఫెషనల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ 2014-15 విద్యా సంవత్సరంలో పాత విధానం ప్రకారమే ఫీజు రీఎంబర్స్ మెంటు ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర విద్యార్థుల ఫీజులను ఆ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని అఖిల పక్ష సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు సీమాంధ్రతోపాటు దేశంలోని ఏ ప్రాంతంలో చదువుతున్నా పాత నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తారు. అలాగే, తెలంగాణలో చదువుకుంటున్న సీమాం«ద్ర విద్యార్థుల ఫీజులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రీయింబర్స్మెంట్ పథకం కింద కాలేజీలకు చెల్లించాల్సిన బకాయిల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానికత ఆధారంగా ఏ రాష్ట్ర విద్యార్థుల బకాయిలను ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకంలో ఇప్పటికే ఉన్న నిబంధనలను ఇక ముందు కూడా పాటించాలని నిర్ణయించారు. ఫీజుల పథకానికి సంబంధించి అఖిలపక్షంలో ఏకాభిప్రాయం రావడంతో నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment