Monday, June 16, 2014

అవును ముళ్ళకిరీటమే...బాబుకు అర్ధమవుతున్న వాస్తవం...

రామకుప్పం, జూన్ 16 : ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటం వంటిదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా సోమవారం సొంత నియోజకవర్గం రామకుప్పం పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఆర్థిక వనరులు లేవని, జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవని అన్నారు. అయితే కష్టపడడం తనకు కొత్తకాదని, 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో మనం భాగస్వాములమని, కేంద్ర సహకారం ఉందని ఆయన అన్నారు. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన హామీలన్నీ  అమలు చేస్తాను తప్పా వెనుతిరిగేది లేదని ఆయన స్పష్టం చేశారు.  రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని, సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుని ఏపీని అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. నీరు-మీరు కార్యక్రమంతో కరువును ఎదుర్కొంటామని బాబు వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...