న్యూఢిల్లీ, జూన్ 3 : కేంద్ర గ్రామీణ, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రి గోపీనాథ్ ముండే( 64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు కారులో ఎయిర్పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మోతీబాగ్ సమీపంలో ఉదయం 6:30 గంటలకు ముండే ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గోపినాథ్ను ఎయిమ్స్కు తరలించారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7:20 గంటలకు ముండే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రమాదంలో ముండేకు బలమైన గాయలు ఏమీ కాలేదని, తీవ్ర ఆందోళన వల్లే ముండే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. డిసెంబర్ 12, 1949లో గోపినాథ్ ముండే జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో బీడ్ నుంచి 2 లక్షల మెజార్టీతో ముండే విజయం సాధించారు. కేంద్ర గ్రామీణ, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిగా ముండే బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా కూడా ముండే పనిచేశారు. గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో ముగినిపోయారు. బుధవారం మహారాష్ట్రలోని లాతూర్లో గోపినాథ్ ముండే అంత్యక్రియలు జరుగనున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment