Sunday, June 15, 2014

సరోగసి ద్వారా ఆడపిల్లను కన్న మంచు లక్ష్మీ....

హైదరాబాద్, జూన్ 15 : నటుడు, దర్శక, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె నటి మంచు లక్ష్మీ తల్లి అయింది.  బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, షారూక్ ఖాన్ తరహాలో మంచు లక్ష్మీ కూడా సరోగసి ద్వారా ఆడ శిశువుకు జన్మ నిచ్చింది. ఫాదర్స్ డే రోజున  తండ్రి మోహన్‌బాబును తాతను చేస్తూ ఆయనకు మనవరాలిని కానుకగా ఆందించారు.  సృష్టికి ప్రతి సృష్టి చేయగల విధానమే సరోగసీ. అద్దె గర్భం. పిల్లలు ఇక పుట్టరు  అనుకొన్న దంపతులు సరోగసీ విధానం ద్వారా బిడ్డను కనvacchu. ఒక దంపతులకు సంబంధించిన పిండం వేరొక స్త్రీ గర్భాశయంలో 9 నెలలు పెరిగి జన్మించడం ద్వారా వచ్చిన శిశువును సరోగసీ (అద్దె గర్భం) శిశువు anTaaru.  స్త్రీలలో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు లేదా గర్భాశయం చిన్నదిగా ఉండటం, వ్యాధులు సోకడం వల్ల గర్భాశయాన్ని తీసివేసినప్పుడు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సరోగసీ అవసరమవుతుంది. సరోగఫీ విధానంలో భాగంగా భార్యాభర్తలలో స్త్రీ నుంచి అండాన్ని, అదే విధంగా పురుషుని నుంచి శుక్రకణాలను సేకరించడం జరుగుతుంది. వీటిని ప్రయోగశాలలో కృత్రిమంగా ఫలదీకరణం చెందించి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తారు. సంయుక్త బీజం విభజన చెంది కొన్ని కణాల దశలో పిండంగా వున్నపడు సరోగసీ తల్లి (వేరొక మహిళ) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...