Wednesday, June 25, 2014

టి.ఆర్.ఎస్. లో చేరిన 11 మంది ఎమ్మెల్సీలు..

హైదరాబాద్, జూన్ 25 ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు టి.డి.పి. ,ఇద్దరు  బీఎస్పీ, ఇద్దరు పి.ఆర్.టి. ఎమ్మెల్సీలు కేసీఆర్ సమక్షంలో  గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పటిష్టమైన తెలంగాణ కోసం రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన మానని గాయమంటూ గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో చెప్పడం దారుణమని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదని.. దీని వల్ల గిరిజన కుటుంబాలు నష్టపోతాయని, అందుకే పోలవరం డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, ఇంకా ఎందుకు తెలంగాణ ద్రోహ పార్టీ (టీడీపీ)లో కొనసాగుతారని కేసీఆర్ ప్రశ్నించారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌, ఆమోస్‌, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాజలింగం, టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, సలీం, పీఆర్టీయూ ఎమ్మెల్సీలు పూల రవీందర్‌, జనార్దన్‌రెడ్డి తదితరులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...