Thursday, May 15, 2014

ప్రాదేశిక ఫలితాలు...సీమాంధ్ర లో టీడీపీ హవా...తెలంగాణాలో కారు జోరు

హైదరాబాద్,మే 14: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ... టీడీపీ -373 ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 275 , కాంగ్రెస్ -2 స్థానాలు, ఇతరులు - 3 స్థానాలు గెలుచుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 10,092 ఎంపీటీసీ స్థానాలకు గాను 10,081 స్థానాల్లో కౌంటింగ్ పూర్తి కాగా, టీడీపీ - 5,216 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ - 4,199 , కాంగ్రెస్‌-  172, సీపీఐ - 24, సీపీఎం -14, బీజేపీ -13, బీఎస్‌పీ - 2, ఇతరులు -431 స్థానాలు గెలుచుకున్నారు.
తెలంగాణ
తెలంగాణ లో తెలంగాణలో మొత్తం 440 జెడ్పీటీసీ స్థానాలకు గాను- టీఆర్ఎస్-191, కాంగ్రెస్ -176, టీడీపీ 53, వైఎస్ఆర్ సీపీ- 6, బీజేపీ - 4, సీపీఎం 2, సీపీఐ 2, ఇతరులు 6  స్థానాలు గెలుచుకున్నారు. అలాగే
తెలంగాణలో మొత్తం 6,467ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ 2351, టీఆర్‌ఎస్ 1868, బీజేపీ 275, వైఎస్ఆర్ సీపీ - 121, సి.పి. ఎం - 145, సీపీఐ 80.., బీఎస్‌పీ 28, ఇతరులు 545. లోక్‌సత్తా 1 స్థానాలు గెలుచుకున్నారు. 
రీపోలింగ్
నిజామాబాద్ జిల్లా, బండపల్లి, మైలారం స్థానాల ఏకగ్రీవంపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహిస్తామని రాస్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత్‌రెడ్డి  చెప్పారు. కోర్టు ఆదేశం మేరకు కొల్లాపూర్ జడ్పీటీసీకి ఈనెల 18న రీ పోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా తూర్పు ఎర్రబెల్లిలో చెదలు పట్టిన బ్యాలట్‌లకు రీపోలింగ్ నిర్వహిస్తామని రమాకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే తెనాలిలో రెండు చోట్ల రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...