Friday, May 16, 2014

స్వతంత్ర భారతావని చరిత్రలో కొత్త అధ్యాయం... మోడీ సునామీలో మట్టి కరచిన కాంగ్రెస్

న్యూఢిల్లీ, మే 16:  స్వతంత్ర భారతావని చరిత్రలో భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యాయ్యాన్ని ఆవిష్కరించింది. సార్వత్రిక ఎన్నికలలో ఎవ్వరి సాయం లేకుండానే, తనంతట తానుగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీగా  భారతీయ జనతా పార్టీ రికార్డు నెలకొల్పింది. గతంలో ఎప్పుడైనా ఒక్క కాంగ్రెస్‌ మాత్రమే తనంతట తానుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్థాయిలో మెజారిటీ సాధించగలిగింది. ఒక కాంగ్రెసేతర పార్టీ  తొలిసారిగా ఇంత మెజారిటీ సాధించడం ఇదే మొదటి సారి. నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిజెపి ప్రకటించిన అనంతరమే ఇది సాధ్యమైందని చెప్పక తప్పదు. గతంలో ఎన్నడూ లేనంతటి దుస్థితిని కాంగ్రెస్ పార్టీ, దాన్ని నమ్ముకున్న పార్టీలు ఈ ఎన్నికలలో మూటగట్టుకున్నాయి.  నరేంద్ర మోదీని  తమ నాయకునిగా ఎన్నుకోవడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ శనివారం సమావేశం అవుతోంది. అనంతరం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించవలసిందిగా కోరతారు.  భారతీయ జనతా పార్టీని భారీ మెజారిటీతో గెలిపించిన దేశ ప్రజలకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఇన్ని ఎన్నికలు జరిగినా, ఒక అభ్యర్థికి ఐదు లక్షల 75 వేల మెజారిటీ రావడం ఇదే మొదటిసారి అని, ఆ రికార్డు సృష్టించిన వడోదర ఓటర్లకు ఇదే తమ కృతజ్ఞతాభివందనలు అని ఆయన అన్నారు.   దేశ భవిష్యత్తుకోసం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...