Thursday, May 15, 2014

పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా

హైదరాబాద్, మే 15 : ఈ ఏడాది పదో తరగతి పరీక్షా  ఫలితాల్లో 88.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో 96.26 శాతం ఉత్తీర్ణతతో తూర్పుగోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలువగా, 58.31 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో కడప, మూడో స్థానంలో వరంగల్ నిలిచాయి. ఈ సారి కూడా బాలిక ల హవా కొనసాగింది. బాలికలు 89.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 87.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. 5,784 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 77 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూన్ 16 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. 10 రోజుల్లో టెన్త్ మార్కుల జాబితా ఆయా పాఠశాలలకు పంపనున్నట్లు వారు తెలిపారు. రీకౌంటింగ్, రీవాల్యూషన్‌లకు ఈనెల 30  చివరి తేదీ.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...