Tuesday, May 27, 2014

ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం... మహానాడు లో చంద్రబాబు

హైదరాబాద్, మే 27:  సీమాంధ్రలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అలాగే తెలంగాణాలో సామాజిక న్యాయాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కష్టకాలంలో కష్టపడి పనిచేయాలని,  ప్రతికూల పరిస్థితులను ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మార్చుకోవాలని  చంద్రబాబునాయుడు మంగళవారం  ప్రారంభమైన పార్టీ మహానాడు లో పిలుపు ఇచ్చారు.  ఈ 32 ఏళ్లలో అనేక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మనం జాతీయ పార్టీగా మారుతున్నాం అంటూ ప్రతి ఒక్కరం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు, రాష్ట్ర సమస్యల పరిష్కారంకోసం మనం రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు.  అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చుదిద్దుదాం, యువతకు మంచి భవితను ఇద్దాం, ఇదే ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఘన విజయాన్ని తెలుగు జాతికి అంకితం చేస్తున్నట్లు  చంద్రబాబునాయుడు తెలిపారు. 30 ఏళ్ల క్రితమే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేసింది టీడీపీనే అని ఆయన తెలిపారు.  ఢిల్లీలో పీవీకి స్మారకచిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...