హైదరాబాద్, మే 28 : పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ ఆర్డినెన్స్ బుధవారం సాయంత్రం జారీ అయ్యింది. దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆర్డినెన్ప్ జారీకి మంగళవారం జరిగిన భేటీలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని చింతూరు, భద్రాచలం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్కంపాడు, పీఆర్ పురం మండలాలు సీమాంధ్రలో కలవనున్నాయి.
ఆర్డినెన్స్ పై కేసీఆర్ గరం...తెలంగాణ బంద్కు పిలుపు
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురువారం తెలంగాణ బంద్కు పిలుపు ఇచ్చారు. ఆంధ్రా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. పోలవరం దిగువ గ్రామాలు మునగకుండా ఎత్తును తగ్గించాలని తాము కోరుతున్నామని ఆయన అన్నారు.
ఆర్డినెన్స్ పై కేసీఆర్ గరం...తెలంగాణ బంద్కు పిలుపు
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురువారం తెలంగాణ బంద్కు పిలుపు ఇచ్చారు. ఆంధ్రా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రం తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టాలని తాము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. పోలవరం దిగువ గ్రామాలు మునగకుండా ఎత్తును తగ్గించాలని తాము కోరుతున్నామని ఆయన అన్నారు.
No comments:
Post a Comment