న్యూ ఢిల్లీ, మే 27: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్లధనాన్ని విదేశాలనుంచి రప్పించడానికి నడుం బిగించారు. మంగళవారంనాడు కేబినెట్ తొలి సమావేశంలోనే విదేశాలనుంచి నల్లధ నాన్ని తీసుకురావడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ - సిట్-ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం బి షా నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. దీనికి వైస్ చైర్మన్ గా జస్టిస్ అర్జిత్ పసాయత్ ఉంటారని, ఈ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి డైరెక్టర్, ఇంటలిజన్స్ బ్యూరో డైరెక్టర్, ఇంకా డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్, రా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం బి షా నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. దీనికి వైస్ చైర్మన్ గా జస్టిస్ అర్జిత్ పసాయత్ ఉంటారని, ఈ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటి డైరెక్టర్, ఇంటలిజన్స్ బ్యూరో డైరెక్టర్, ఇంకా డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్, రా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారని చెప్పారు.
No comments:
Post a Comment