Wednesday, May 28, 2014

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు

న్యూఢిల్లీ, మే 28 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా ఉన్న నరసింహన్ జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్రానికి కూడా  గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటున్న కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...