Monday, May 12, 2014

మున్సిపల్ ఎన్నికలు ....సీమాంధ్రలో సైకిల్ తడాఖా... తెలంగాణలో పరువు నిలుపుకున్న కాంగ్రెసు...


హైదరాబాద్, మే 12 :  సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతంగా భావిస్తున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం   , తెలంగాణలో కాంగ్రెసు  పార్టీలు సత్తా చాటుకున్నాయి.   తెలంగాణలో 53 మున్సిపల్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 23, టీడీడీ, బీజేపీ కూటమికి 11, టీఆర్ఎస్‌కు 9, లభించగా ఇతరులు 9, ఎంఐఎం 1 సీట్లు గెలుపొందాయి. సీమాంధ్రలో 92 మున్సిపల్ స్థానాలకు గానూ తెలుగుదేశం పార్టీ 65 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 20, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు.  రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన సీమాంధ్ర ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో చూపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి గెలుపు చారిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  చంద్రబాబు నాయుడు  అన్నారు. అఖండ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు. సీమాంధ్ర ప్రజలు తమ ఓటు ద్వారా అవినీతికి గుణపాఠం చెప్పారని, అభివృద్ధికి పట్టం గట్టారని చంద్రబాబు అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...