Wednesday, May 21, 2014

బీహార్ సుఖాంతం...కొత్త సి.ఎం. గా నితీశ్ జిగ్రీ దోస్తే..

పాట్నా, మే 20: నితీష్ కుమార్ రాజీనామా అనంతరం బీహార్  రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా జితన్‌రామ్ మాంఝి(68) మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు 17మంది మంత్రులతో గవర్నర్ డి.వై.పాటిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. మాంఝి.. నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ సందర్భంగా మాంఝి మాట్లాడుతూ.. నితీశ్ ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేయడమే తన ప్రథమ ప్రాధాన్యమన్నారు. 23న జరిగే విశ్వాస పరీక్ష అనంతరం కేబినెట్‌ను విస్తరిస్తానని చెప్పారు.  అంతకుమందు జేడీయూ ప్రభుత్వానికి భేషరతు మద్దతును కొనసాగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఓ లేఖను అందజేశారు. దీంతో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి జేడీయూ కూటమి సభ్యుల సంఖ్య 124కు చేరింది. గత ఏడాది బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి జేడీయూకి కాంగ్రెస్ మద్దతిస్తోంది. మరోవైపు... ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 88కి పడిపోయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...