Wednesday, May 21, 2014

జాతి సేవలో తరిస్తా...నరేంద్రమోడీ

న్యూఢిల్లీ, మే 20 : బలహీనవర్గాల సంక్షేమం కోసమే తమ  ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల కలలు నిజం చేయడమే మన అందరి స్వప్నం అని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం  బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం మోదీ మాట్లాడుతూ, సెప్టెంబర్ 13న ప్రధాని అభ్యర్థిగా తనను ఎన్నుకున్నారని, సెప్టెంబర్ 15 నుంచి తాను పని చేయడం ప్రారంభించానని , ఆ రోజు నుంచి అణువణువు...క్షణక్షణం ఆ బాధ్యత నెరవేర్చేందుకు పనిచేశానని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలా జీవించడానికే ప్రాధాన్యమిచ్చానన్నారు. పేదవాడు ఈ స్థాయికి ఎదగడం భారత రాజ్యంగం గొప్పతనమని మోదీ అన్నారు.

భారతదేశమే తన తల్లి అని...తన తల్లికి సేవచేసే భాగ్యం కలగడం అదృష్టమని మోదీ ఉద్ఘాటించారు. బీజేపీ కూడా తన తల్లి లాంటిదే అని ఆయన అన్నారు.  ఆశావాదులే దేశాన్ని ముందుకు నడిపించగలరని నిరాశావాదులు దేశాన్ని ముందుకు నడిపించలేరన్నారు. 125 కోట్ల జనాభా ఒక్క అడుగు ముందుకేస్తే భారతదేశం 125 అడుగులు ముందుకెళ్తుందని మోదీ కరతాల ధ్వనుల మధ్య ఉద్విగ్నంగా ప్రకటించారు. సమర్థులైన తన సహచరులు....అనుభవజ్ఞులైన సీనియర్ల అండదండలతో తన బాధ్యతలు సమర్థంగా నెరవేరుస్తానని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2019లో మళ్లీ తన రిపోర్టు కార్డుతో అందరి ముందుకొస్తానని ఆయన తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...