మంత్రులుగాబిజెపి, మిత్రపక్షాల నాయకులు....
న్యూఢిల్లీ, మే 20: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్దాస్ మోదీ వచ్చే సోమవారం 26వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు రాష్టప్రతి భవన్ ఆరుబైట దాదాపు నాలుగు వేల మంది ఆహ్వానితుల సమక్షంలో భారత దేశం పధ్నాలుగో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలో మొదటిసారి కాంగ్రేసేతర, వెనుకబడిన కులాల నాయకుడు పూర్తి బలంతో ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన వెంటనే రాష్టప్రతి భవన్కు వెళ్లి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్న మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తరువాత బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎల్జెపి నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్, శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే తదితర మిత్రపక్షాల నాయకులు ప్రణబ్ ముఖర్జీని కలిసి మోదీని సమర్థిస్తుట్లు లేఖలు అందజేశారు.కాగా, నరేంద్ర మోదీతో పాటు మరికొందరు బిజెపి, మిత్రపక్షాల నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొట్టమొదట ఎంత మందిని మోదీ తన మంత్రివర్గంలో చేర్చుకుంటారనేది ఇంకా స్పష్టం కాలేదు. మొదట చిన్న మంత్రివర్గంతో పని ప్రారంభించి దశల వారీగా మంత్రుల సంఖ్య పెంచుతారా? లేక మొదట ఒకేసారే పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతారా? అనేది చర్చనీయాంశంగా తయారైంది. రాజ్నాథ్ సింగ్, అరుణ్జేట్లి, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషి లాంటి సీనియర్ నాయకులతోపాటు మిత్రపక్షాల నుంచి కొందరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి.
న్యూఢిల్లీ, మే 20: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్దాస్ మోదీ వచ్చే సోమవారం 26వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు రాష్టప్రతి భవన్ ఆరుబైట దాదాపు నాలుగు వేల మంది ఆహ్వానితుల సమక్షంలో భారత దేశం పధ్నాలుగో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశంలో మొదటిసారి కాంగ్రేసేతర, వెనుకబడిన కులాల నాయకుడు పూర్తి బలంతో ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్నారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఎన్నికైన వెంటనే రాష్టప్రతి భవన్కు వెళ్లి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్న మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తరువాత బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎల్జెపి నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్, శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే తదితర మిత్రపక్షాల నాయకులు ప్రణబ్ ముఖర్జీని కలిసి మోదీని సమర్థిస్తుట్లు లేఖలు అందజేశారు.కాగా, నరేంద్ర మోదీతో పాటు మరికొందరు బిజెపి, మిత్రపక్షాల నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొట్టమొదట ఎంత మందిని మోదీ తన మంత్రివర్గంలో చేర్చుకుంటారనేది ఇంకా స్పష్టం కాలేదు. మొదట చిన్న మంత్రివర్గంతో పని ప్రారంభించి దశల వారీగా మంత్రుల సంఖ్య పెంచుతారా? లేక మొదట ఒకేసారే పెద్ద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతారా? అనేది చర్చనీయాంశంగా తయారైంది. రాజ్నాథ్ సింగ్, అరుణ్జేట్లి, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషి లాంటి సీనియర్ నాయకులతోపాటు మిత్రపక్షాల నుంచి కొందరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment