Tuesday, May 6, 2014

సబ్బం హరికి బాబు సబ్బు రాశాడా...!

విశాఖ లోక్‌సభ పోటీ నుంచి చివరి క్షణంలో
తప్పుకున్న జై సమైక్యాంధ్ర  అభ్యర్థి సబ్బం  హరి... 
విశాఖపట్నం, మే 6 : విశాఖ లోక్‌సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జై సమైక్యాంధ్ర పార్టీ నేత సబ్బంహరి ప్రకటించారు. టీడీపీ-బీజేపీ కూటమికే తన మద్దతని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి గెలవాలని సబ్బంహరి ఆకాంక్షించారు. రాష్ట్ర సమైక్యత కోసం తీవ్రంగా ప్రయత్నించామని సబ్బం తెలిపారు. సమైక్యత కోసం సుప్రీంలో చివరి వరకు పోరాటం చేశామని, అయితే విభజన ఆగదని  సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తేలిపోయిందన్నారు.  తన నిర్ణయంతో జై సమైక్యాంధ్ర పార్టీ కి సంబంధం లేదని ఆయన వివరించారు. తనకు రహస్య ఏజెండాలు ఏమీ లేవని సబ్బం తేల్చిచెప్పారు. విశాఖలో విజయలక్ష్మిని పోటీలో నిలపడం వెనుక కుట్ర ఉందని, విశాఖ వనరులను కొల్లగొట్టడమే జగన్ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. కాగా ఎలాగైనా అధిలారం దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు చివరి క్షణంలో  పోటీ నుంచి తప్పుకునేలా సబ్బం హరిని మేనేజ్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...