అదిలాబాద్, ఏప్రిల్ 23 : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 40 సంవత్సరాలుగా బీసీల కోసం వారికి న్యాయం జరిగే విధంగా ఉద్యమిస్తున్న ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ అధ్యక్షుడు, మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో జరిగిన ప్రజాగర్జన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబునాయుడు బుధవారం ప్రసంగించారు. తెలంగాణ తన వల్ల వచ్చిందని టీఆర్ఎస్, తామే ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్నారని వాస్తవానికి 2008లోనే తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ లేఖ ఇచ్చిందన్నారు. దొరల గడీల పాలన అంతం చేయడమే టీడీపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు తీసుకురావడం జరిగిందని , ప్రాజెక్టులైనా, రోడ్లు అయినా, మంచినీటికి సంబంధించిన అభివృద్ధి అయినా తన హయాంలోనే జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను తాను ఇచ్చానన్నారు. కేంద్రంతో పోరాడి సింగరేణి బంద్ అవుతున్న సందర్భంలో రూ. 600 కోట్ల అప్పు మీద మారటోరియం ఇప్పించి సింగరేణి ని కాపాడామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment