Sunday, April 6, 2014

టీఆర్ఎస్ మలిజాబితా-కడియం శ్రీహరికి వరంగల్ లోక్ సభ టికెట్...

హైదరాబాద్, ఏప్రిల్ 5 : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం రెండు విడతల్లో 12 మంది పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. వారిలో ఎనిమిదిమంది లోక్‌సభ, నలుగురు అసెంబ్లీ అభ్యర్థులున్నారు. 69 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థుల పేర్లతో మొదటి జాబితాను శుక్రవారం వెల్లడించిన టీఆర్ఎస్.. శనివారం రెండు విడతల్లో మీడియా ప్రతినిధులకు ఎస్ఎంఎస్ ల ద్వారా 8 లోక్‌సభ, 4 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.  రెండో జాబితాలో అభ్యర్థులు వీరే..
లోక్‌సభ స్థానాలు
భువనగిరి- డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (బీసీ-గౌడ్)
నల్లగొండ -డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఓసీ-రెడ్డి)
నాగర్ కర్నూల్ -డాక్టర్ మంద జగన్నాథం (ఎస్సీ-మాదిగ)
మహబూబ్‌నగర్ -ఏపీ జితేందర్‌రెడ్డి (ఓసీ-రెడ్డి)
వరంగల్ -కడియం శ్రీహరి (ఎస్సీ-మాదిగ)
కరీంనగర్ -బి.వినోద్‌కుమార్ (ఓసీ-వెలమ)
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (ఓసీ-రెడ్డి)
సికింద్రాబాద్ - తూం భీంసేన్ (బీసీ-మున్నూరు కాపు)
అసెంబ్లీ స్థానాలు
నిజామాబాద్ రూరల్ - బాజిరెడ్డి గోవర్ధన్ (బీసీ-మున్నూరు కాపు)
మల్కాజిగిరి- చింతల కనకారెడ్డి (ఓసీ-రెడ్డి)
కోదాడ - కె.శశిధర్‌రెడ్డి (ఓసీ-రెడ్డి)
షాద్‌నగర్ -వై.అంజయ్యయాదవ్ (బీసీ-యాదవ్)


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...