న్యూఢిల్లీ,ఫిబ్రవరి 21: ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాల మధ్య అధికారుల పంపిణీపై కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల శాఖ రెండు అధికారిక కమిటీలను నియమించింది. ఒక కమిటీ అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ చూస్తుందని... రెండో కమిటీ రాష్ట్ర స్థాయి అధికారుల విభజన పూర్తి చేస్తుందని జీవోఎం సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. విభజన వల్ల సీమాంధ్రకు ఎంతో లాభం చేకూరిందని. ప్రధాని ప్రకటించిన ఆరు ఆంశాల ప్యాకేజీ, హోంమంత్రి ప్రకటించిన మూడు అంశాల ప్యాకేజీతో ---నవరత్న ప్యాకేజీ---- ద్వారా సీమాంధ్ర
సీమాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించడం వల్ల కేంద్రం నుంచి 90 శాతం గ్రాంట్లు, పది శాతం రుణాలు లభిస్తాయని ఆయన అన్నారు. సాధారణంగా అయితే రాష్ట్రాలకు 70 శాతం రుణాలు, 30శాతం గ్రాంట్లు లభిస్తాయని తెలిపారు. ఇది కేవలం బీజేపీ నేతల ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయంకాదని, ఎంపీలు, మంత్రులు రాహుల్ గాంధీని కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘంలో డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో సీమాంధ్ర కోసం ప్రత్యేక విభాగం పనిచేస్తుందని చెప్పారు. పోలవరంను బహుళార్థ సాధక ప్రాజెక్టుగాగుర్తించి కేంద్రమే పూర్తి చేస్తుందని తెలిపారు. ముంపు ప్రాంతాలు, సహాయ పునరావాస ప్రాంతాలు సీమాంధ్రకే ఇచ్చి పోలవరం ప్రాజెక్టును నిరాఘాటంగా చేయడానికి వీలుగా త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తామన్నారు. హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్న ప్రకారమే పూర్తవుతాయని చెప్పారు.
ఇజ కొత్త రాజధాని విషయంలో విభజన నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నిపుణుల కమిటీని నియమిస్తామని, ఈ కమిటీ ఆరు నెలల్లో రాజధాని ఎక్కడ నిర్మించాలో చెబుతుందని జైరాం రమేశ్ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూమిని డీనోటిఫై చేస్తామన్నారు. 'అప్పాయింట్ డే' నుంచి రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు, డీజీపీలు, సీఎస్లు ఉంటారని తెలిపారు. ప్రస్తుతానికి 'అప్పాయింట్ డే'పై నిర్ణయం తీసుకోలేదని... గతంలో నోటిషికేషన్, అప్పాయింట్ డే మధ్య మూడు నెలల వరకు సమయం పట్టిందని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం కోసం ప్రత్యేక నదీ బోర్డులను ఏర్పాటు చేస్తామని, వీటికి చైర్మన్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారని ఆయన చెప్పారు.
ప్రాంతానికి ఊహించని ప్రయోజనాలు చేకూరతాయని జైరాం రమేశ్ వివరించారు.
సీమాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించడం వల్ల కేంద్రం నుంచి 90 శాతం గ్రాంట్లు, పది శాతం రుణాలు లభిస్తాయని ఆయన అన్నారు. సాధారణంగా అయితే రాష్ట్రాలకు 70 శాతం రుణాలు, 30శాతం గ్రాంట్లు లభిస్తాయని తెలిపారు. ఇది కేవలం బీజేపీ నేతల ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయంకాదని, ఎంపీలు, మంత్రులు రాహుల్ గాంధీని కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘంలో డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో సీమాంధ్ర కోసం ప్రత్యేక విభాగం పనిచేస్తుందని చెప్పారు. పోలవరంను బహుళార్థ సాధక ప్రాజెక్టుగాగుర్తించి కేంద్రమే పూర్తి చేస్తుందని తెలిపారు. ముంపు ప్రాంతాలు, సహాయ పునరావాస ప్రాంతాలు సీమాంధ్రకే ఇచ్చి పోలవరం ప్రాజెక్టును నిరాఘాటంగా చేయడానికి వీలుగా త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తామన్నారు. హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్న ప్రకారమే పూర్తవుతాయని చెప్పారు.
ఇజ కొత్త రాజధాని విషయంలో విభజన నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నిపుణుల కమిటీని నియమిస్తామని, ఈ కమిటీ ఆరు నెలల్లో రాజధాని ఎక్కడ నిర్మించాలో చెబుతుందని జైరాం రమేశ్ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూమిని డీనోటిఫై చేస్తామన్నారు. 'అప్పాయింట్ డే' నుంచి రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు, డీజీపీలు, సీఎస్లు ఉంటారని తెలిపారు. ప్రస్తుతానికి 'అప్పాయింట్ డే'పై నిర్ణయం తీసుకోలేదని... గతంలో నోటిషికేషన్, అప్పాయింట్ డే మధ్య మూడు నెలల వరకు సమయం పట్టిందని చెప్పారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం కోసం ప్రత్యేక నదీ బోర్డులను ఏర్పాటు చేస్తామని, వీటికి చైర్మన్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులే ఉంటారని ఆయన చెప్పారు.
ప్రాంతానికి ఊహించని ప్రయోజనాలు చేకూరతాయని జైరాం రమేశ్ వివరించారు.
No comments:
Post a Comment