Thursday, February 27, 2014

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రాములమ్మ...

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : మెదక్ జిల్లా ఎంపీ విజయశాంతి  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్ దిగ్విజయ్ సింగ్‌తో కలిసి ఆమె సోనియా గాంధిని ఆమె నివాసంలో కలుసుకున్నారు. కండువా కప్పి విజయశాంతిని  సోనియా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కల సాకారమైందని, గతంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని, పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలని, రెండు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.ఎవరైనా, ఏ నాయకుడైనాసరే ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని విజయశాంతి కేసీఆర్‌ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ కోసం అందరం కష్టపడ్డామని, ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఆమె సూచించారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...