Friday, January 3, 2014

తథా సభ..యథా వాయిదా...

హైదరాబాద్, జనవరి 3: అసెంబ్లీ రెండో విడత శీతాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లుపై చర్చ జరపాలంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభ్యుల నిరసనల మధ్యే వివిధ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించి, ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. అయితే సభలో రభస కొనసాగడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. తరవాత కూడా గంద్రగోళం కొనసాగడం తో సభ ను రేపటికి వాయిదా వేశారు. శాసన మండలి కూడా ఇదే తరహాలో రేపటికి వాయిదా పడింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...