Wednesday, January 1, 2014

ఒక్కసారిగా 215 రూపాయలు పెరిగిన నాన్ సబ్సిడీ సిలిండర్ల ధర...

హైదరాబాద్, జనవరి 1:  వంట  గ్యాస్ ధర మరింత పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరను ప్రభుత్వం ఒక్కసారిగా 215 రూపాయలు పెంచేసింది. అంటే, ఏడాదికి తొమ్మిది సిలిండర్లు దాటితే  పదో సిలిండర్ నుంచి ఒక్కోటీ రూ. 1327.50 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర  1112.50 రూపాయలు గా ఉంది. దీంతోపాటు సబ్సిడీ సిలెండర్‌ ధరను కూడా స్వల్పంగా  పెంచారు. రాయితీ పోను హైదరాబాద్‌లో  సిలెండర్‌ ధర రూ.441కు  చేరుకుంది. ఇది ఇప్పటివరకు రూ. 411.50 గా ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...