Tuesday, December 31, 2013

న్యూజిలాండ్‌కు భారత జట్టు: యువీకి ఉద్వాసన

న్యూఢిల్లీ, జనవరి 1: న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే వన్డే క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సెలెక్షన్ కమిటీ  ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్‌కు ఉద్వాసన పలికారు. బౌలర్ మోహిత్ శర్మ స్థానంలో వరుణ్ అరోన్‌కు స్థానం కల్పించారు.  న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. నేపియర్‌లో జనవరి 19వ తేదీన జరిగే మ్యాచ్ తో వన్డే మ్యాచ్ల సిరీస్ ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్  తర్వాత రెండు టెస్టు మ్యాచ్ లు జరుగుతాయి. తొలి టెస్టు ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభమవుతుంది.
వన్డే జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్) శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే, అంబటి రాయుడు, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఈశ్వర్ పాండే, స్టార్ట్ బిన్నీ, వరుణ్ అరోన్
టెస్టు జట్టు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహనే, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఈశ్వర్ పాండే

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...