Sunday, December 8, 2013

కాషాయ ప్రభంజనం లో కొట్టుకుపోయిన కాంగ్రెస్...

న్యూఢిల్లీ, డిసెంబర్ 8 :  ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో, నాలుగు రాష్ట్రాలకు ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సీట్లు సాధించగా, ఒక్క ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్‌కు మూడు సీట్ల దూరంలో బీజేపీ ఉంది. కాగా నాలుగు రాష్ట్రాల్లోనూ  ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్  సింగ్ చెప్పారు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ప్రజలు తమ పార్టీని ఆదరించారని, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆకర్షణ, ప్రచారం పార్టీకి కలిసొచ్చిందని రాజ్ నాథ్  అన్నారు 
ఎన్నిలక ఫలితాలు :
ఢిల్లీ, మొత్తం స్థానాలు 70 : బీజేపీ : 32, అమ్ అద్మీపార్టీ (ఏఏపీ) : 28, కాంగ్రెస్ 58, ఇతరులు : 2.
మధ్యప్రదేశ్, మొత్తం స్థానాలు 230 : బీజేపీ : 165, కాంగ్రెస్ 58, బీఎస్పీ : 4, ఇతరులు : 3.
రాజస్థాన్, మొత్తం స్థానాలు 199 : బీజేపీ : 162, కాంగ్రెస్ 21, ఇతరులు : 16.
ఛత్తీస్‌గడ్, మొత్తం స్థానాలు 90 : బీజేపీ : 49, కాంగ్రెస్ 39, బీఎస్పీ : 1, ఇతరులు : 1.
కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరో రాష్త్రం మిజోరాం ఫలితాలు సోమవారం వెలువడతాయి.
కాషాయ ప్రభంజనం లో కొట్టుకుపోయిన కాంగ్రెస్...

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...