Thursday, December 5, 2013

దక్షిణాఫ్రికా నల్ల సూరీడు అస్తమయం...

జోహెన్నెస్బర్గ్, డిసెంబర్ 5: దక్షిణాఫ్రికా నల్ల సూరీడుగా పేరొందిన నెల్సన్ మండేలా(95) గురువారం అర్థరాత్రి కన్నుమూశారు. నల్ల జాతీయుల హక్కుల కోసం 27 ఏళ్లు జైళ్లో గడిపిన మండేలా 1994-99 వరకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా  పనిచేశారు.ఆయనకు 1993లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2001 లో మండేలాకు గాంధీ అంతర్జాతీయ పురస్కారం లభించింది.  జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచారు.  జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో జరిగిన ఒక మారణకాండకు సంబంధించి 27 సంవత్సరాల పాటు "రోబెన్" అనే ద్వీపంలో జైలు శిక్షననుభవించారు. మహాత్మా గాంధీ బోధించిన శాంతియుత విధానాలు, అహింస, శత్రువును సంస్కారయుతంగా ఎదుర్కొనే పద్ధతి తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని మండేలా పలుసార్లు పేర్కొన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...