Saturday, November 16, 2013

సచిన్ చివరి మ్యాచ్: మూడో రోజే ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం

ముంబై, నవంబర్ 16: సచిన్ టెండూల్కర్ వీడ్కోలు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. మంబై టెస్టులో మూడో రోజే విండీస్ ను ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో ఓడించింది.  దీంతో రెండు టెస్టుల సిరీస్ ను ధోనీసేన 2-0తో సొంతం చేసుకుంది. 43/3 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 187 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్ విండీస్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్ లో ఓజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాకపోవడంతో మళ్లీ బ్యాటింగ్ కు దిగని సచిన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులను అలరించాడు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...