Monday, November 18, 2013

శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు :షిండే

న్యూఢిల్లీ, నవంబర్ 18:  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోం  మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు.  ఈ నెల 21 కేంద్ర మంత్రి మండలి సమావేశమవుతుందని చెప్పారు.  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5న ప్రారంభమవుతాయి. శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టాలంటే ఈ నెల 21న జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలోనే తెలంగాణ బిల్లును ఆమోదించవలసి ఉంటుంది.  ఇలావుండగా  ఈ నెలఖరులోగా జీఓఎం నివేదిక సిద్ధం అవుతుందని కేంద్రమంత్రి  వీరప్ప మొయిలీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాగా,  మంత్రుల బృందం సోమవారం నాడు  సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో  సమావేశం  జరిపింది.  కేంద్ర మంత్రులు  పల్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురందేశ్వరి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...