Saturday, November 16, 2013

బరువెక్కిన వాంఖడే..భావోద్వేగంతో సచిన్ కు వీడ్కోలు

ముంబై, నవంబర్ 16:ముంబై వాంఖడే స్టేడియంలో శనివారం  అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది.  ఏ క్రికెటర్ కూ లభించని  గౌరవం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు దక్కింది. తన చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన అనంతరం సచిన్ కెరీర్ కు ఘనమైన వీడ్కోలు పలికాడు. మాస్టర్ వీడ్కోలు సందేశం ప్రారంభించగానే స్టేడియంలో గంభీర వాతావరణం నెలకొంది.క్రికెట్ ఎప్పుడూ తన హృదయంలో నిలిచి ఉంటుందని, క్రికెట్‌పై తనకున్న అభిమానం ఇంతకాలం నడిపిందని సచిన్ టెండూల్కర్ అన్నారు.   విజయంతో టెస్టు ముగిసిన వెంటనే సచిన్ భావోద్వేగంతో కంటతడిపెట్టుకున్నారు. మైదానంలో అభిమానులకు అభివాదం చేశారు. చప్పట్లతో అభిమానులు సచిన్‌ను వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ తాను ఎంతో భావోద్వేగంతో ఉన్నానని తెలిపారు. గత 24 ఏళ్లుగా క్రి కెట్‌ను ఆస్వాధించానని అభిమానులకు చెప్పారు. 22 గజాల పిచ్‌లో 24 ఏళ్లు గడపడం ఆనందంగా ఉందని సచిన్ తెలిపారు. వరల్ట్ కప్ సమయంలో తన తండ్రిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందని, తన తండ్రి పోత్రాహం లేకపోతే తానీ స్థితిలో ఉండేవాడిని కాదని సచిన్ అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ సచిన్ కృతజ్ఞతలు తెలిపారు.తన గురించి అమ్మ ఎప్పుడూ ఆలోచించేందని, తనకోసం త్యాగాలు చేసిన అమ్మకు సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పుడు క్రీజ్‌లో ఉన్నా బాగా ఆడాలని అమ్మ ప్రార్థించేదని గుర్తు చేసుకున్నారు. తన ఆంటీ సొంత కొడుకులా చూసుకుందని, తనకు సోదరి తొలి బ్యాట్‌ను బహుమతిగా అందజేశారని చెప్పారు.  తన అన్న అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన చెప్పారు.  అంజలి సహాయ సహకారాలు లేకపోతే ఇంత సాధించే వాడిని కాదని, క్రికెట్ వల్ల తన కుటుంబ సభ్యులతో గడపలేకపోయానని, తన కుటుంబ బాధ్యతలను అంజలి చూసుకుందని సచిన్ తెలిపారు. ఈ క్రమంలో అంజలి టెండూల్కర్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. స్టేడియంలో ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మాజీ క్రికెటర్లు, సహచరల క్రికెటర్లకు సచిన్ కృతజ్ఞతలు చెప్పారు. కుంబ్లే, గంగూలి, ద్రావిడ్, లక్షణ్ తన కుటుంబం అని సచిన్ అన్నారు.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...