Saturday, November 16, 2013

ప్రముఖ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు 'భారతరత్న'

న్యూఢిల్లీ, నవంబర్ 16: సైన్స్ లో విశేష సేవలు చేసినందుకు  ప్రధాని సాంకేతిక సలహాదారుడు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్న పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.  భారత క్రికెట్ కు విశేష సేవలు అందించిన సచిన్ టెండూల్కర్ తో కలిపి రావుకు  కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రావు పూర్తి పేరు  చింతామణి నాగేశ రామచంద్ర రావు. బెంగళూరులో జూన్ 30, 1934న  నాగేశ్వరరావు, నాగమ్మ దంపతులకు జన్మించిన  రావు  సాలిడ్‌ స్టేట్‌ కెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌ రంగాలలో  ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడయ్యారు.  ట్రాన్సిషన్ మెటల్ ఆక్సైడ్ గురించిన ఆయన పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు శాస్త్ర, సాంకేతిక సలహాదారులుగా ఉన్నారు.మైసూర్ విశ్వవిద్యాలయంలో 1951లో డిగ్రీ పూర్తి చేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీపూర్తి చేశారు. 1958లో ఫుర్డ్యూ యూనివర్సిటీలో పిహెచ్ డి అందుకున్నారు. కాన్పూరు ఐఐటిలో దాదాపు 13 ఏళ్లు రసాయశాస్త అధ్యాపడుకుడగా పని చేశారు. 84-94 మధ్య కాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు డైరెక్టర్ గా ఉన్నారు. ఆక్స్ ఫర్డ్, కేండ్రిడ్జి, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేశారు. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రిసెర్చ్ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా పని చేశారు.60 ఏళ్ల పరిశోధనా ప్రస్థానం లో సి.ఎన్.ఆర్.రావు .  అనేక అవార్డులు  అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్‌ అవార్డులు అందజేసింది. దేశవిదేశాల నుంచి ఆయన 150కి పైగా పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ లు ఇచ్చాయి.2000 లో  రాయల్ సొసైటీ నుంచి హ్యూస్ మెడల్, 2004 లో భారత ప్రభుత్వం నుండి ఇండియా సైన్సు అవార్డు ,     2005 లో టెల్ అవివ్ యూనివర్సిటీ నుంచి డాన్ డేవిడ్ ప్రైజ్ అందుకున్నారు. ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ రాయల్ సొసైటీ (లండన్), ఫ్రెంచ్ అకాడమీ, జపాన్ అకాడమీ, పోంటిఫికల్ అకాడమీ అవార్డులు ఆయన అందుకున్నారు.  45కి పైగా పుస్తకాలు, 1500 పైగా పరిశోధనా వ్యాసాలు రాశారు.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...