Monday, November 25, 2013

ఆరుషిని అమ్మా,నాన్నే చంపేశారు...

న్యూఢిల్లీ, నవంబర్ 25:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, పని మనిషి  హేమ్‌రాజ్‌  హత్య కేసులో  ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది.  అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఈ  హత్య కేసులో తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్ లే కూతురు ఆరుషి, తమ వద్ద పని చేసే హేమరాజ్ ను హత్య చేశారని సి. బి.ఐ. ఛార్జీషీట్ లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది.  ఈ రోజు తీర్పు వెలువరించిన కోర్టు -తల్వార్ దంపతులు హత్యతో పాటు సాక్ష్యాధారాలు కూడా వారు తారుమారు చేశారని తెలిపింది.  ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది.  నిందితుడిగా అనుమానించిన హేమ్‌రాజ్‌ కూడా ఆ తరువాత  అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...