Monday, November 25, 2013

టి.బిల్లుపై తొందర ప(పె)డుతున్న సోనియా...?

న్యూఢిల్లీ, నవంబర్ 25:  రాష్ట్ర విభజనపై   కసరత్తు చేసి తయారు చేసిన నివేదికను కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సోమవారం నాడు యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అందజేసింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ,  దిగ్విజయ్ సింగ్, చిదంబరం  పాల్గొన్నారు.గంటన్నరసేపు జరిగిన వీరి సమావేశం లో   హైదరాబాద్ పైనే  ప్రధానంగా చర్చ జరిగినట్టు సమచారం.  జిహెచ్ ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేస్తే సీమాంధ్రుల హక్కులకు రక్షణ లభిస్తుందని జిఓఎంలోని ఒక సభ్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 27న జిఓఎం తుది సమావేశం జరుగనుంది.  సోనియా గాంధీ  ఇచ్చిన సలహాల ఆధారంగా తుది నివేదిక రూపొందించే అవకాశం ఉంది.  తెలంగాణ బిల్లును శీతాకాలం సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, మొదటికే మోసం వస్తుందని సోనియా గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ బిల్లును వాయిదా వేయడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుందని, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనకడుగు వేసినట్లు వాయిదా వేయడం మంచిది కాదని సోనియా  వాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయం చెప్పడానికి కనీసం రెండు వారాలైనా సమయం ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  భావిస్తున్నారుట.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...