Tuesday, November 12, 2013

విలీనం గిలీనం జాన్తా నై....

హైదరాబాద్, నవంబర్ 12: కాంగ్రెస్‌లో  టి. ఆర్. ఎస్. విలీనం ఉండదని ప్రజలకు గట్టిగా చెప్పాలంటూ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయని, అదే జరిగితే మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండని  ఉద్భోదించారు. "కేంద్రంలో ఉన్నోళ్లకు మతి లేనట్టుంది. ఏం ఇచ్చినా తీసుకుంటారని అనుకుంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు చేస్తున్నారు. హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాలు కేంద్రం పరిధిలో ఉండటానికి టీ కాంగ్రెస్ నేతలు అంగీకరించి వచ్చారు. తెలంగాణ ప్రజలు అంత అసమర్థులా? శాంతిభద్రతలను స్వయంగా నిర్వహించుకోలేరా? ఇది అవమానించడం కాదా?'' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌తో ఎలా కలుస్తామని ప్రశ్నించారు. "ఇదివరకు చెన్నారెడ్డి కాంగ్రెస్‌లో కలిస్తే అమ్ముడుపోయారన్నారు. తెలంగాణకు ద్రోహం చేశారని తిట్టిపోశారు. ఇప్పుడు మనం..ఆంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని అంగీకరిస్తే, ఇన్ని రోజులు చేసిన పోరాటం వృధా అవుతుంది. మనల్ని కూడా ద్రోహుల కింద జమకడతారు. ఇన్ని రోజులు పోరాడి.. చివరి నిమిషంలో ముఖానికి మసి ఎందుకు అంటించుకోవాలి? అందుకే షరతులు, ఆంక్షలులేని సంపూర్ణ తెలంగాణ కావాలని జీవోఎం ముందు కుండబద్ధలు కొడ్తాం. వింటే అదృష్టం.. లేకపోతే వాళ్ల ఖర్మ'' అని కేసీఆర్ అన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...