న్యూఢిల్లీ,నవంబర్ 16: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానుల కోరిక ఫలించింది. క్రికెట్ లో భారతదేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన సచిన్ క్రికెట్కు గుడ్బై చెప్పిన రోజునే ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సచిన్ స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడింది. ప్రపంచ క్రీడారంగంలో భారత బ్రాండ్ అంబాసిడర్ సచినే అని ఆ లేఖలో పేర్కొంది. క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న లిటిల్ మాస్టర్ 'భారతరత్న' అందుకోవడంలో కూడా రికార్డు సృష్టించాడు. భారతరత్న అందుకోనున్న అతి చిన్న వయస్కుడు(40) సచిన్. ఈ అత్యున్నత పురస్కారం అందుకోనున్న తొలి క్రీడాకారుడిగా కూడా చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డును తన తల్లి రజనీ టెండూల్కర్కు అంకితమిస్తున్నట్లు సచిన్ చెప్పాడు. రమేశ్ టెండూల్కర్, రజని దంపతుల
కు 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన సచిన్ భారత క్రికెట్ కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా - అంతర్జాతీయ కెరీర్ లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా - టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా లిటిల్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన సచిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1999లో పద్మశ్రీ, 1998లో క్రీడల్లో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ఖేల్రత్న, 1994లో అర్జున అవార్డు, 2008లో పద్మవిభూషణ్ లను మాస్టర్ అందుకున్నాడు. ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేసింది. ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా దక్కించుకొని క్రీడారంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ నిలిచాడు.
కు 1973 ఏప్రిల్ 24న ముంబైలో జన్మించిన సచిన్ భారత క్రికెట్ కు 24 ఏళ్ల పాటు సేవలు అందించాడు. లెక్కకుమిక్కిలి రికార్డులు నెలకొల్పాడు. రెండు వందల టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా - అంతర్జాతీయ కెరీర్ లో వంద సెంచరీలు చేసిన తొలి క్రికెటర్ గా - టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా లిటిల్ మాస్టర్ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన సచిన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1999లో పద్మశ్రీ, 1998లో క్రీడల్లో అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ఖేల్రత్న, 1994లో అర్జున అవార్డు, 2008లో పద్మవిభూషణ్ లను మాస్టర్ అందుకున్నాడు. ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేసింది. ఇప్పుడు దేశ అత్యున్నత పౌర పురస్కారం కూడా దక్కించుకొని క్రీడారంగంలో ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్ నిలిచాడు.
No comments:
Post a Comment